చిత్రం: భాగ్యరేఖ
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గానం: సుశీల
ప: నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేదీ నేలపై..ఈ..
ఏ లీల సేవింతునో..ఓ ఓ ఓ
ఏ పూల పూజింతునో..ఓ..
౧. శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
ఈ పేదరాలి మనస్సెంతో వేచె
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
ఈ పేదరాలి మనస్సెంతో వేచె
నీ పాద సేవా మహాభాగ్యమీవా
నా పైని దయజూపవా..నా స్వామి
నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో..ఏ పూల పూజింతునో!!
౨. దూరాననైన కనే భాగ్యమీవా
నీ రూపు నాలో సదా నిల్వనీవా
ఏడుకొండలపైనా వీడైన స్వామి
నా పైని దయజూపవా..నా స్వామి
నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో..ఏ పూల పూజింతునో!!
0 comments:
Post a Comment