skip to main |
skip to sidebar
నీకాలి కొనగోటి రాకా సుధాంశువులు
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు వ్రాసిన
`వందే శ్రీ మాతరం' ఆల్బంలో పాట:
పల్లవి: నీకాలి
కొనగోటి రాకాసుధాంశువులు నీవేలి కొసలలో నిండైన అరుణిమలు
ప్రసరింపజేయుమమ్మా ఆ
ప్రభలే జీవనములమ్మా
చరణం: (1) రాజేశ్వరీ చరణరజమురవ్వంతైన లభియించినను నొసట విభూతిగ
దాల్చెదను
అదియే
సామ్రాజ్యమమ్మా ఆ వరమునందించుమమ్మా
(2) పరమహంసల
గమనసరణిని ప్రబోధించు హంసగమనా! నీదు అంఘ్రులను తలదాల్తు
అనుగుబిడ్డను
బ్రోవుమమ్మా గుహునివలె నను జూడుమమ్మా
(3) ఒక్కచరణపు
శోభ చక్కనౌ పసపుసిరి మరియొక్క పాదమ్ము స్వచ్ఛ ధావళ్యమ్ము
అమ్మ అయ్యల
మూర్తివమ్మా ఆశ్రయించిన సుతుడనమ్మా
0 comments:
Post a Comment