చిత్రం : పూల రంగడు
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రచన : దాశరథి
గానం : కె. బి. మోహన్ రాజు, పి. సుశీల
ప. చిగురులు వేసిన కలలన్ని..
సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ..
మమతల తీరం చేరినవి.. మమతల తీరంచేరినవి..
ఆ.ఆ.ఓ...ఓ...ఓ
1. సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నానూ..ఊ..
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నాను
నిండు మనసు పందిరి కాగా ...
నిన్ను అందుకున్నాను.. నిన్నే అందుకున్నాను...
2. దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
నా తనువు అణువణువు..
నీదే నీదే ఈనాడు.. నీదే నీదే ఏనాడు...
3. నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే..ఏ..
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే
పరిమళాల తరగలలోనే..ఏ...ఆ ఆ ఆ...
పరిమళాల తరగలలోనే...
కరిగించిన చెలియవు నీవే.. కరగించిన చెలియవు నీవే
0 comments:
Post a Comment