పూజ్య
గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అష్టలక్ష్ములపై శ్లోకములు,
పాటలు వ్రాసారు. ఇవి ఆయా లక్ష్ములకు సంబంధించిన శాస్త్రవైభవములతో శ్రీ
సూక్తము మొదలైనవాటితో మంత్రగర్భితంగా కూర్చబడినవి. ఈ శ్రావణ మాసంలో నిత్య
పారాయణం చేసుకోదగినవి.
శ్లోకము: శ్రీ కారుణ్యసుధామయీం జగదధిష్ఠాత్రీం సదా పోషకీమ్సస్యారణ్య నదీ నదాది వసురూపాం అన్నదాం ధారుణీమ్
క్షుద్బాధాపరిహారిణీం సకల భూతాధార భూతాం పరామ్
ధన్యాం ధాన్య సమృద్ధిదాం సుతరసీం లక్ష్మీం హృదా భావయే
పల్లవి: ధాన్యలక్ష్మీం అన్నదాయినీం ప్రార్థయే పుణ్యసంపాదినీం పూర్ణాం ప్రసన్నామ్
చరణం: శాకంభరీం జీవ శక్తి సంధాయినీమ్
ఆకారదాయినీం ఆరోగ్యభాగ్యదామ్
శ్రీకర సుదీర్ఘాయురైశ్వర్య కారిణీమ్
ప్రాకృత వర ప్రదామ్ రక్షిత జగత్త్రయీమ్ ... పల్లవి....
చరణం: పుష్టిప్రదాం లోక పోషిణీం చిత్కళామ్
ఇష్టఫల సిద్ధిదాం ఇంద్రియాధీశ్వరీమ్
తుష్టిదామ్ స్వాహా స్వధాకార ధారిణీమ్
సృష్టికర్త్రీం సదా దృష్ట సంవర్ధినీమ్
http://picosong.com/ccKJ/
0 comments:
Post a Comment