ప: రామకథను వినరయ్యా
ఇహపర సుఖముల నొసగే
సీతారామకథను వినరయ్యా
౧. అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు
ఆ రాజుకు రాణులు మువ్వురు కౌసల్య సుమిత్రా కైకేయి
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నలుగురు
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ||| రామకథ |||
౨. తాటకి దునిమి గన్నము గాచి తపసుల దీవెన తలదాచి
జనకుని యాగము జూచు నెపమ్మున కనియెను మిథిలపురాజలది ||| రామకథ |||
౩. సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే కదిలినది
ధరణిజ మదిలో మెదలిన మోదము కన్నుల వెన్నెల విరిసినది ||| రామకథ |||
౪. హరుని విల్లు రఘునాధుడు ఎత్తిన పెళపెళ విరిగినదీ
కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిసినవి ||| రామకథ |||
0 comments:
Post a Comment